ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి : కేటీఆర్

-

గుజరాత్​లో బిల్కిస్​ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఈ విషయంపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే.. 11 మంది నిందితులను గుజరాత్​ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్​.. ఇప్పుడు మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు.

స్వాత్రంత్య్ర దినోత్సవం రోజునే 11 మంది అత్యాచార దోషులను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్​ ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్​తో పాటు పలువురిని నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

https://twitter.com/KTRTRS/status/1560246054087376896?cxt=HHwWgICqgaHhjacrAAAA

Read more RELATED
Recommended to you

Latest news