నేను అలిగి పార్టీకి దూరంగా లేను – జగ్గారెడ్డి

-

తెలంగాణలో 47 నియోజకవర్గాలలో పాదయాత్ర చేపట్టేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మానిక్ రావు ఠాక్రేకి లేఖ రాసిన విషయం తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి తనకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఆవేదన ఎపిసోడ్ ముగిసిందన్నారు జగ్గారెడ్డి. మెదక్ నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.

తన పాదయాత్రకి అనుమతి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. తాను ఎవరికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయడం లేదని.. రేవంత్, భట్టి పాదయాత్ర చేయని చాలా నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాదయాత్ర చేస్తానన్నారు జగ్గారెడ్డి. పాదయాత్ర ఎవరు చేసినా పార్టీకి లాభమేనన్నారు. అయితే గొడవలు ఎందుకు అని తాను గాంధీభవన్ కి దూరంగా ఉన్నానని.. పార్టీ కూడా తనకి ఎటువంటి పని చెప్పలేదన్నారు. రాజకీయాలలో అలగడం తప్పు అన్నారు జగ్గారెడ్డి. తాను అలిగి పార్టీకి దూరంగా లేనని.. వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news