విద్యార్థులకు గుడ్ న్యూస్…స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

-

రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్ న్యూస్…స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్ళకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా….ఆ తర్వాత 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

Three days of school holidays

అలాగే మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. కాగా, తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనుండగా… 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news