టీఆర్‌ఎస్‌ బిగ్‌ స్కెచ్‌..నేడు మునుగోడుకు కేటీఆర్‌, హరీశ్‌రావు

-

ఇవాళ మునుగోడులో చివరి రోజు ప్రచారం కావడంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ బిగ్‌ స్కెచ్‌ వేసింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో కేటీఆర్‌ మరియు హరీష్‌ రావు రంగంలోకి దిగనున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారం ముగియనున్నది.

చివరి రోజు ఎన్నికల ప్రచారంతో మునుగోడు దద్దరిల్లిపోతున్నది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు మంత్రులు ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నారాయణపూర్ మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మునుగోడు పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అటు తన్నీరు హరీష్ రావు కూడా రోడ్ షోలలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news