కేసిఆర్ అనుమతి ఇస్తే.. ఏపీలో పర్యటించి జగన్ కు చుక్కలు చూపిస్తా -టిఆర్ఎస్ ఎమ్మెల్యే

-

కేసిఆర్ అనుమతి ఇస్తే.. ఏపీలో పర్యటించి జగన్ కు చుక్కలు చూపిస్తానని టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కిందట నర్సంపేట లో పాదయాత్ర చేసిన వైయస్ షర్మిల.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైయస్ షర్మిల వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.

ఆ తర్వాత వైఎస్ షర్మిలను అరెస్టు చేయడం, సజ్జల రియాక్ట్ కావడం చోటుచేసుకుంది. అయితే సజ్జల రియాక్ట్ కావడంపై పెద్ద సుదర్శన్ రెడ్డి స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించడాన్ని తాము ఏపీ ప్రభుత్వం స్పందించినట్లే తీసుకుంటామని.. ఏపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించాడు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే తాను ఏపీలో పర్యటిస్తానని పెద్ద సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పర్యటించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను తాను ఎత్తిచూపుతానని వెల్లడించారు. ఇక తన ఆస్తులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని షర్మిలకు ఛాలెంజ్ విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news