ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించునున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

-

ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు.గోదావరి వరద వంపు ప్రాంతం, ప్రాజెక్టుల సందర్శన పర్యటనలో భాగంగా *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడెం వీరయ్య (సిఎల్ పి బృందం) రెండవ రోజు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (సింగరేణి గెస్ట్ హౌస్) నుంచి ఉదయం 8 గంటలకు ములుగు, భూపాలపల్లి మీదుగా కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతారు.

ములుగు జిల్లా ఎటునాగారంలో గోదావరి బ్రిడ్జి మునిగిపోయిన ఘాట్లను పరిశీలిస్తారు. మంచిర్యాల చెన్నూరు మంథని నియోజకవర్గాల్లో గోదావరి బ్యాక్ వాటర్ తో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చుతారు.గోదావరి వరదతో మునిగిపోయిన కాలేశ్వరం ప్రాజెక్టు, పాడైపోయిన ప్రాజెక్టు బాహుబలి మోటర్లు, కడెం ప్రాజెక్టు, కొమురం భీం ప్రాజెక్టు లను సందర్శిస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news