బిజెపి విజయసంకల్ప సభతో టిఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి: విజయశాంతి

-

తెలంగాణలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభతో టిఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అన్నారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలి ఆనందం పొందిందని విమర్శించారు.

బోనాలకు వచ్చినంత జనం కూడా బిజెపి సభకు రాలేదని రాష్ట్రమంత్రులు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అసలు పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం ఏంటని విజయశాంతి ప్రశ్నించారు. కెసిఆర్ బృందం మోడీ ని తిడుతూ అల్ప సంతోషాన్ని పొందుతుందని విమర్శించారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, కానీ తెలంగాణలో ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news