తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం – ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. నేడు హైదరాబాద్ లోని నాగోల్ లో నిర్వహించిన ఓబీసీ సమ్మేళనంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. త్వరలో లక్షలాది మందితో బీసీల గర్జన నిర్వహిస్తామని తెలిపారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలోని బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ హయాంలో బీసీలకు న్యాయం చేస్తున్నామని.. తెలంగాణలోనూ కేసీఆర్ పాలనలో బీసీలు వెనకబాటుకు గురయ్యారని విమర్శించారు.

ఇక ఇదే కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. కెసిఆర్ బీసీల ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నయా నిజాంలా మారిన కెసిఆర్ కు గోరి కట్టే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news