కేసీఆర్ కి అంత వణుకు ఎందుకు…?

-

నాగర్ కర్నూలు ఉప్పనుంతల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శ్రీశైలం భూగర్భ విద్యుత్ కేంద్రం వద్దకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ ఘర్షణకు దిగారు. బాధిత కుటుంబాలను పరామర్శించే అధికారం తమకు లేదా అని ఆయన పోలీసులను నిలదీశారు. మేము చట్టాలు చేసే వాళ్ళం మీరు పాటించే వాళ్ళు అంటూ రేవంత్ మండిపడ్డారు.

Revanth-Reddy writes a letter tp pm modi regarding the situation in hyderabad

ప్రమాద స్థలాన్ని చూడటానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారు అని, అంత భయం కేసీఆర్ కి ఎందుకు అని నిలదీశారు. నేను ఎంపీని మాత్రమే కాదు నల్లమల బిడ్డను కూడా, నాకు వెళ్ళే స్వేచ్చ ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు. సిఐడీ విచారణ జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళడానికి కుదరదు అని రేవంత్ రెడ్డికి పోలీసులు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news