వేధింపులను ఎదుర్కొంటున్న తెలుగు హీరోయిన్.. ఏమైందంటే..?

-

ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియా వేధింపులకు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి కూడా వేధింపులను ఎదుర్కొంటుంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కెరియర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న చాందిని చౌదరి.. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె నటించిన కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె .. ఈ సినిమా ద్వారా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈమె తాజాగా సైబర్ నేరగాళ్ల వేధింపులను ఎదుర్కొంటుంది.

ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియా ద్వారా ముప్పుతిప్పలు పెడుతున్నారు . ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.. గత కొన్ని నెలల నుంచి అంతర్జాతీయ నెంబర్లు ఉపయోగించి కొంతమంది వ్యక్తులు తమ పేర్లు వాడుకొని స్కాం చేస్తున్నారు అని తెలిపింది.

పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి తమ పేర్లు వాడుకుంటూ వాట్సప్ లో మెసేజ్లు పంపుతున్నారని ఇది ఇంతటితో ఆగిపోవడం లేదని.. వేధింపులకు కూడా గురి చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ విధంగా తనను మాత్రమే కాదు తన కోస్టార్ ల పేర్లు ఫోటోల పై కూడా సైబర్ వేధింపులకు దిగుతున్నారని తెలిపింది. ఎవరికైనా ఇలాంటి మెసేజ్లు వస్తే నమ్మవద్దని వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవద్దని కూడా తెలిపింది. దాంతోపాటు తన ఇన్ స్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది.

సెలబ్రిటీలే టార్గెట్ గా ఫైబర్ నేరగాళ్లు ఇలాంటి పనులు చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వేధింపులకు పాల్పడుతున్నారు. నటీనటుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం..తప్పుడు సమాచారాన్ని పంపించడం మరియు వ్యక్తిగత వివరాలతో డిజిటల్ మోసాలకు పాల్పడడం వంటివి నిత్యం చూస్తూనే ఉన్నాము. అందుకే అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news