కశ్మీర్‌లో ఉద్రిక్తత.. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతం..!!

-

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఒక పోలీసు అమరుడయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారని అధికారులు నిర్ధారించారు. కాగా, బారాముల్లా జిల్లా క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మేరకు పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టారు. అలాగే ముష్కరుల కాల్పుల్లో గాయపడి ఒక పోలీసులు అమరుడయ్యాడు.

కశ్మీర్-ఉగ్రవాదం
కశ్మీర్-ఉగ్రవాదం

ఉగ్రవాదంపై పోరులో భారత భద్రతా బలగాలు కీలక పాత్ర పోషించాయి. పోలీసులు, భారత బలగాలు చూపించిన ధైర్య సాహసాలకు కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ఉగ్రవాద దాడులను తట్టుకునేలా.. భారత దేశాన్ని పటిష్ట భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు అమర మరణం పొందిన పోలీసుకు నివాళులర్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news