మధిరలో భట్టి విక్రమార్క ఓటమి తథ్యం :తమ్మినేని వీరభద్రం

-

తెలంగాణాలో సీట్లు కేటాయింపు, పొత్తులు విషయంపై చాలా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సిపిఐ నేత తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఐ తో కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకోలేదో సమాధానం చెప్పాలంటూ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మాతో పొత్తు పెట్టుకుంటేనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అధిక స్థానాలలో విజయం సాధిస్తుంది అన్న నమ్మకాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు సిపిఐ నేతలు. మాతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో ఓటమి పాలు అవుతుంది, అందులోనూ మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న భట్టి విక్రమార్క ముందుగా ఓటమి పాలు అవుతాడంటూ తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమితో భట్టి విక్రమార్క ఎందుకు మనము సిపిఎం తో పొత్తు పెట్టుకోలేదు అంటూ బాధపడడం ఖచ్చితమని ధీమాను వ్యక్తం చేశారు తమ్మినేని.

కానీ రాష్ట్ర వ్యాప్తంగ ఆచూస్తే మాత్రం కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఎక్కడా లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news