రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతూనేఉంది: సీఎం కేసీఆర్

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణపై సమైక్య పాలకులు వివక్ష చూపారని.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ అప్పటినుండే వివక్ష ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వేడుకలు కూడా జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టిందని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఐదేళ్ళపాటు హైకోర్టును విభజించకుండా తాత్సారం చేసిందని కేసీఆర్ విమర్శించారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ .24 వేల కోట్ల నిధులను ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. కరోనా సమయంలో కూడా ఒక్కపైసా అదనంగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ పక్కన పెట్టింది అని అన్నారు. ఐటీఐఆర్ పార్కుకు కేంద్రం మంగళం పలికిందని కెసిఆర్ దుయ్యబట్టారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహాన్ని కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రంపై ఏదోరకంగా పోరాటం చేయాల్సి వస్తుందని.. ఇకపై కూడా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news