దేశానికి అంబేద్కర్ ఇండియాగా పేరు మార్చాలి: ఆర్ నారాయణ మూర్తి

-

అమలాపురం ఘటనపై నటుడు ఆర్.నారాయణమూర్తి స్పందించారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడం శుభపరిణామం అని నారాయణమూర్తి పేర్కొన్నారు. దాడులు దారుణమని, నాయకుల ఇల్లు తగలబెట్టడం సమంజసం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు జిల్లాకే కాదు.. దేశానికే అంబేద్కర్ ఇండియా గా పేరు మార్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న పీఎం మోడీ మాట తప్పారని విమర్శించారు. దేశానికి రైతే రాజు అని.. రైతును బికారి చేసే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు.

రైతు ఆత్మహత్యలు నివారించేందుకు ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ 2006లో నివేదిక ఇచ్చిందని, ఆ నివేదిక ఇప్పటికీ అమలు కావడం లేదని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 22వ రాష్ట్ర మహాసభ ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు అనంతపురం లో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news