రేపు రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించనున్న గవర్నర్

-

రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. రేపు మొదటగా మహిళా దర్బార్ ప్రారంభించనున్నారు. ఈనెల 10న రాజభవన్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. మొదటి ప్రజాదర్బార్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు.

మహిళల నుంచి సమస్యలు విజ్ఞప్తులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించనున్నారు. ఇందుకోసం మహిళలు 040-23310521 కు ఫోన్ చేసి లేదా[email protected] కు మెయిల్ చేయాలని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్ భవన్ ఉందని.. ప్రతి నెలా ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ గవర్నర్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news