తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ కొత్తగా నలుగురు స్థానం అంటూ ప్రచారం జరుగుతోంది. రేసులో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు.

ఈ తరుణంలోనే కొత్త మంత్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఫోన్ కూడా చేశారు. ఈ తరుణంలోనే కొత్త మంత్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్ కు అభినందనలు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్.