తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధాకరం: జస్టిస్ ఎన్వి రమణ

-

తెలుగుభాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధగా ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన” మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, శివమాల దంపతులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ తో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డ గా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది తెలుగువారు ఉన్నారని.. ఎన్నో దశలలో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు అన్నారు. తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవనవిధానం నాగరికత అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. మన భాషతోపాటు పరాయి భాషను గౌరవిస్తున్నామని.. మాతృభాష, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు. అమ్మ భాషలోని తీయదనం అనుభవించాల్సిందే.. మాటల్లో చెప్పలేం అన్నారు. ఇంట్లో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలన్న సీజేఐ.. మన బాషా, సంస్కృతి మరిచిపోతే జాతి అంతరించి పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news