ఆ జైల్లో ఖైదీలకు మటన్ బిర్యానీ పెడుతున్న పోలీసులు..ఎందుకో తెలుసా?

-

నేరం చేసిన వాళ్ళే జైలుకు వెళ్తారు..అయితే వారిలో మార్పు రావాలని జైల్లో కఠినమైన శిక్షలను అమలు పరుస్తారు. ఇక జైల్లో వసతుల గురించి చెప్పనక్కర్లేదు.. అలాంటి బతుకుల్లో అప్పుడప్పుడు వెలుగులు నింపేందుకు అధికారులు వారికి స్పెషల్ ఫుడ్ పెడుతుంటారు.కానీ ఓ జైలులో మాత్రం ఖైదీలకు లగ్జరీ ఫుడ్ ను అందిస్తున్నారు.. అందుకు కారణం కూడా లేకపోలేదు..దసరా సందర్భంగా వారికి పండుగ వాతావరణాన్ని అందించేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు..

విషయానికొస్తే..దక్షిణ కోల్‌కతాలోని జైలు అధికారులు ఏకంగా 2,500 మంది ఖైదీలకు మటన్ బిర్యానీతో పాటు రకరకాల రుచికరమైన వంటలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ దసరా పండుగ సందర్భంగా ప్రెసిడెన్సీ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లోని దాదాపు 2,500 మంది ఖైదీలు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు మాంసాహార పదార్థాలు పెట్టనున్నారు. మహా అష్టమి రోజు మినహా మూడు రోజులు వారికి స్పెషల్ ఫుడ్ పెడతారు. ఈ ఖైదీలకు శాకాహారమైన ఖిచురి, పోలావ్, లూచీ, దమ్ ఆలూ, పనీర్ మసాలా, కోర్మా వంటివి అందిస్తారు.

అక్టోబర్ 3వ తేదీ అష్టమి రోజున కాకుండా మిగతా మూడు రోజులు ఖైదీలు తినడానికి రక రకాల మాంసం అందుబాటులో ఉంటుంది. ఇందులో మటన్ బిర్యానీ, మటన్ కాలియా, వివిధ రకాల చేపలు, రొయ్యల వంటకాలు, ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ లాంటివి ఎన్నో ఉంటాయి.ఈ ప్రత్యేక మెనూలో రసగుల్లాలు, లడ్డూల వంటి స్వీట్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ దసరా సందర్భంగా ఖైదీలు కూడా పండగ చేసుకుంటున్నారు. వారు కూడా మనుషులే, వారి పట్ల కూడా ప్రేమ చూపించి వారిని మార్చాలనే ఉద్దేశంతో అధికారులు ఇలా చేస్తున్నారు..అధికారుల నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news