జూబ్లీ హిల్స్ రేప్ కేసు లో పోలీసుల సంచలన నిర్ణయం

-

జూబ్లీ హిల్స్ మైనర్‌ బాలిక రేప్ కేసు లో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైనర్‌ బాలిక రేప్ కేస్ నిందితులను ట్రైల్ సమయంలో మేజర్ లుగా పరిగణించాలని జ్యువనైల్ జస్టిస్ బోర్డ్ ను కోరారు పోలీసులు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత ట్రైల్ జరిగే సమయం లో ఐదుగురిని అడల్ట్ లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

పోలీసుల విజ్ఞప్తి పై జువైనయల్ జస్టిస్ దే తుది నిర్ణయం కానుంది. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్ధ్యం అన్నిటినీ పరిగణలోకి తీసుకునీ నిర్ణయం వెల్లడించనున్నారు జువైనయల్ జస్టిస్. మైనర్లకు 21 యేళ్లు దాటిన తరువాత వారిని జువైనయల్ హోం నుండి సాధారణ జైలు కు తరలించనున్నారు. కాగా.. జూబ్లీ హిల్స్ రేప్ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితుల్లో మేజర్ గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news