మద్యం మత్తులో రోడ్డుపై కత్తితో హల్ చల్ చేసిన మాజీ మంత్రి కొడుకు

-

షాజాపూర్ కు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడా కొడుకు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డు పై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. తన ఎస్వియు(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీ కొట్టాడు. దినేష్ అహుజా అతడి అనుచరులతో కలిసి భూపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే బాధితులు దినేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు.. బాధితులు తాము పోలీస్ స్టేషన్ కు వెళతాము, నష్టపరిహారం ఇవ్వాలని కోరడంతో.. అతను మరింత రెచ్చిపోయి మరోసారి దినేష్ కారును ఢీ కొట్టాడు. దీంతో దినేష్, అతని అనుచరులు రోహితప్ ను బయటకు దిగాలని కోరడంతో.. అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లి పోయినట్లుగా తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు అష్టా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news