దేశం మొత్తం కెసిఆర్ ను పొగుడుతుంది – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

దేశం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగుడుతుంటే.. బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనే సన్నాసి మాత్రం కెసిఆర్ ని తిడుతున్నాడని మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశం మొత్తం కెసిఆర్ ని పొగుడుతుంటే బిజెపి మాత్రం కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. 24 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి ఆ రాష్ట్రాలలో ఒక్క అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు.

పెన్షన్లు ఇవ్వడం చేతకాదని, లక్ష రూపాయలు కల్లాలకు ఇవ్వడం లేదని, పదివేల పెట్టుబడి కూడా బిజెపి ఇవ్వలేదని.. ఇక్కడ మాత్రం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది అనే విషయంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news