Telangana : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడి ఇంటికి తగలబెట్టిన యువతి కుటుంబం

-

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడి ఇంటికి తగలబెట్టింది యువతి కుటుంబం. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, హుజురాబాద్‌ కు చెందిన ఓ జంట కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, అమ్మాయి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు.

దీంతో చేసేదేమీ లేక, రాజన్న సిరిసిల్లా జిల్లా వేముల వాడ రాజన్న సన్నిధిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలియడంతో, యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురైయ్యారు. అక్కడితో ఆగకుండా, యువకుడి ఇంటికి నిప్పు అంటించారు. ఈ విషయం తెలిసిన ఆ కొత్త జంట, పోలీసులను ఆశ్రయించింది. తమను కాపాడలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news