ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. నిందితుడిని మూడు రోజులపాటు గుడిలో బంధించిన గ్రామ యువకులు

-

వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని మధుకర్ అనే యువకుణ్ణి గుడిలో బంధించారు గ్రామ యువకులు. మూడు రోజులుగా గుడిలోనే బంధిగా ఉన్నాడు యువకుడు. జోగులాంబ గద్వాల.. అంపూర్ కు చెందిన మధుకర్ సెక్రటరీ ఉద్యోగాలిప్పిస్తానంటూ యువకులకు ఎర వేసాడు. మూడేళ్ళ క్రితం యువకుల నుండి ఏడు లక్షలు వసూలు చేసాడు మధుకర్. అయితే ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో మధుకర్ ను నిలదీశారు యువకులు.

 

డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే మధుకర్ స్పందించలేదు. దీంతో నేరుగా ఇంటికి వెళ్ళి మధుకర్ ను లాకొచ్చి గుడిలో బంధించారు యువకులు. మధుకర్ తల్లదండ్రులు వచ్చి డబ్బులు ఇచ్చేదాక వదలమన్నారు యువకులు. గ్రామ సర్పంచ్ ఆద్వర్యంలో {పంచాయతీ}…. భూమి అమ్మి డబ్బులు కడతామని వెళ్ళిపోయారు తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Latest news