హైదరాబాద్ శివారులో దొంగలు బాబోయ్.. దొంగలు

-

హైదరాబాద్: ఎవరూ లేని ఇళ్లే వాళ్ల టార్గెట్. సైలెంట్‌గా వస్తారు. పని కానించి వెళ్లిపోతారు. శివారులో హల్ చల్ చేస్తారు. అర్ధరాత్రి అరడజను దొంగలు. ఈ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్‌లో రికార్డ్. ఇది హైదరాబాద్ శివారులో పరిస్థితి.

బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ శివారులో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. దుకాణాల్లో కూడా కన్నం వేసేందుకు ప్రయత్నించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్‌లో ఈ ఘటన జరిగింది. ఎవరూ లేని ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలకు యత్నించారు. చోరీలకు ముందు రెక్కీ కూడా నిర్వహించారని తెలుస్తోంది. భారీగా బంగారాన్ని దోచుకెళ్లారు.

ఒకే ముఠాకు చెందిన వారే దొంగతనాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని అంటున్నారు. లాక్ డౌన్ కావడంతో శివారు ప్రాంతాలనే దొంగలు టార్గెట్ చేశారని చెబుతున్నారు. గతంలో కూడా దొంగతనాలు జరిగాయని పేర్కొన్నారు.

ఇక బాధితులు ఆవేదన చెందుతున్నారు. తాము లేని సమయంలో ఉన్నదంతా దోచుకెళ్లారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news