‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు సీక్వెల్..స్పష్టతనిచ్చిన దర్శకుడు..

-

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తొందని చెప్పొచ్చు. కొన్ని చిత్రాలు తెరకెక్కించేప్పుడే స్పష్టంగా రెండు పార్ట్స్ లో రాబోతున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, మరి కొన్ని సినిమాలకు మాత్రం విడుదలైన కొంత కాలానికి సీక్వెల్స్ ప్లాన్ చేస్తు్న్నారు. ‘బాహుబలి’ పార్ట్ వన్, టూ రాగా, పుష్ప పార్ట్ వన్, టూ వస్తున్నాయి. ఇక బాలీవుడ్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’ మూడు పార్ట్స్ గా రాబోతున్నది.

ఈ క్రమంలోనే అసలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది ఈ ఫిల్మ్. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర సీక్వెల్ గురించి చాలా కాలం నుంచి డిస్కషన్స్ జరుగుతుండగా, తాజాగా మూవీ సీక్వెల్ పైన క్లారిటీనిచ్చారు ఆ చిత్ర దర్శకులు.

స్వరూప్ ఆర్ఎస్‌జె డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో డిటెక్టివ్ గా నవీన్ పొలిశెట్టి నటించారు. స్వరూప్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్ర సీక్వెల్ పైన క్లారిటీ ఇచ్చారు దర్శకులు.

తన తొలి చిత్రం అయిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్ పక్కాగా ఉంటుంద‌ని చెప్పాడు. ప్రజెంట్ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నామ‌ని, త్వరలోనే సీక్వెల్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాడు. ఇక నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేశారు. ప్రజెంట్ ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నవీన్ పొలిశెట్టికి జోడీగా స్వీటీ అనుష్క నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news