ఇండియా, హిందువులను వేర్వేరుగా చూడలేం: ఆర్ఎస్‌ఎస్ చీఫ్

-

హిందువులు లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా హిందువులు లేరని, ఇండియా, హిందువులను వేర్వేరుగా చూడలేమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇండియా తన కాళ్లపై తాను నిలబడింది. ఇదే హిందుత్వం సారాంశం. ఈ కారణంగానే ఇండియా హిందువుల దేశం అని పేర్కొన్నారు.

భారతదేశ విభజనపై మోహన్ భగవత్ మాట్లాడారు. దేశ విభజనతో భారత్ ముక్కలైంది. పాకిస్తాన్ ఏర్పడింది. మనం హిందువులం అనే భావనను విస్మరించడం వల్లే దేశ విభజన జరిగింది. ఈ విషయాన్ని ముస్లింలు కూడా మరిచిపోయారు. మొదట హిందువులం అనే భావించే వారి బలం తగ్గింది. ఆ తర్వాత వారి సంఖ్య కూడా తగ్గింది. అందుకే, పాకిస్తాన్ ఎప్పటికీ భారత్‌కు చెందినది కాకుండా పోయింది. హిందువుల సంఖ్య, బలం తగ్గిందా లేక హిందుత్వ భావాలు తగ్గిపోయా అనేది మీరు చూస్తున్నారు. హిందువులు హిందువులుగా ఉండాలంటే భారత్ అఖండ్‌గా మారాలి.

Read more RELATED
Recommended to you

Latest news