ఆ ఊర్లో 60 ఏళ్లుగా ఒక్క పురుగు కూడా లేదు.కారణం ఏంటంటే?

-

ఊరు అన్నాక మనుషులు,పచ్చని పైర్లు,పాడి పశువులు ఉంటాయి.ఇళ్లు, పందిళ్లు పరుచుకున్న లోగిళ్లు, పిల్లా పాపలతో కళకళాలాడాల్సిన ఆ ఊరు.. ఇప్పుడు వల్లకాడులా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మితమైన కట్టడాలతో అడుగడుగునా చారిత్రక విశిష్టతతో ఉండాల్సిన ఆ ఊరు ఒక్క సారిగా బోసిపోయింది..

పిల్లాపాపలతో కట్టుబట్టలతో తలోదిక్కుకు వెళ్లిపోయారు. ప్రభుత్వం చేసిన ఆ ఒక్క పని కారణంగా ఆ ఊరు ఊరే కకావికలమైపోయింది. ఇలాంటి ఊళ్లు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఒక్కో గ్రామానిది ఒక్కో కన్నీటి గాథ..
అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ విలేజ్ మాత్రం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అరవై ఏళ్లుగా పాడుపడిపోయింది. అరవయ్యేళ్ల సమయంలో ఆ గ్రామంలో మనిషనే వాడే అడుగు పెట్టలేదంటే అతిశయోక్తి కాదు..అరవైఏళ్ళ నుంచి ఆ ఊరిలో పురుగు కూడా లేకపోవడం గమనార్హం..ఆ ఊరి గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…స్పెయిన్‌ దేశంలోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో ఉన్న ఈ ఊరి పేరు గ్రానడిల్లా…ఈ నగరాన్ని ముస్లింలు నిర్మించారు.

ఊరికి సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. ప్రజలు ఈ నది నీటిని ఉపయోగించి పంటలు పండించుకునేవారు. ఈ క్రమంలో స్పెయిన్‌ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1950లో ఈ ఊరి సమీపంలోని నది మీద రిజర్వాయర్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అందుకు ఊరు మొత్తాన్ని ఖాళీ చేయాలని ఆదేశించాడు. రిజర్వాయర్‌ పనులు కొనసాగుతుండగా, 1960 ప్రాంతంలో ఊరు మునిగిపోవచ్చని అధికారులు అంచనా వేశారు. దాంతో ఊళ్లోని జనాలు భయపడి ఊరిని ఖాళీచేసేశారు.. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయినా, ఊరు ముంపునకు గురి కాలేదు. రిజర్వాయర్‌ కోసం గ్రానడిల్లా వెళ్లాల్సిన మార్గాలన్నింటినీ ధ్వంసం చేసేశారు. దీంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇలా దాదాపు 60 ఏళ్లుగా మనుషులు లేని గ్రామంగా మిగిలిపోయింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version