మోడీ పాల‌నలో దేశం ఉండ‌దు.. రాసిపెట్టుకొర్రి : సీఎం కేసీఆర్

-

దేశంలో మోడీ రాక్షస పాల‌న కొన‌సాగుతుంద‌ని అన్నారు. మోడీ పాల‌న ఇలాగే కొన‌సాగిస్తే.. దేశం ఉండ‌ద‌ని తెలంగాణ రా ముఖ్య మంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అన్ని రంగాల‌ను నాశనం చేస్తున్నారని విమ‌ర్శించారు. అన్ని రంగాల‌ను ప్ర‌యివేటు పరం చేస్తున్నార‌ని మండి పడ్డారు. అలాగే మోడీ మొత్తం అబద్ధాల‌నే మాట్లాడుతున్నార‌ని అన్నారు. స్వ‌యంగా తెలంగాణ రాష్ట్రంలోనే మోడీ అబద్ధాల‌ను ప్ర‌చారం చేశార‌ని అన్నారు.

గ‌తంలో గ‌జ్వేల్ స‌భ‌లో మోడీ అబ‌ద్ధాల‌ను మాట్లాడార‌ని.. సీఎం కేసీఆర్ ఒక వీడియో ను కూడా ప్ర‌సారం చేశారు. అలాగే పార్ల‌మెంట్ లో కూడా లో అబ‌ద్ధాల‌ను మాట్లాడుతున్నార‌ని అన్నారు. ఎవ‌రిని పిచ్చోళ్ల‌ని చేయ‌డానికి అబద్ధాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే దేశంలో బ్యాంకుల‌ను, ఎల్ఐసీని, రోడ్ల‌ను, విమానాల‌ను, రైల్వేల‌ను ప్ర‌యివేట్ చేస్తున్నార‌ని అన్నారు. చివ‌రికి క‌రెంటును కూడా ప్ర‌యివేటు ప‌రం చేయాల‌ని ప్ర‌యత్నిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. మోడీ త‌న పాల‌న‌ను ఇలాగే కొనసాగిస్తే.. దేశం ఉండ‌ద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version