2023లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన టాప్ 5 చిత్రాలు ఇవే..!!

-

గతంతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం సినిమాల విషయంలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గతంలో ఎక్కువగా కమర్షియల్ జోనర్ సినిమాల వల్ల వారి చిత్రాలు కూడా డిజాస్టర్ అవుతూ ఉండేవి. సక్సెస్ అయ్యేవి చాలా తక్కువగా ఉండేవని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం సక్సెస్ సినిమాల సంఖ్య భారీగా పెరుగుతోందని చెప్పవచ్చు. ప్రతి నెలలో కచ్చితంగా రెండు మూడు చిత్రాలు సక్సెస్ అవుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది మొదటి మూడు నెలలోనే సినిమాలు చాలా విడుదలయ్యాయి. వాటిలో కమర్షియల్ గా సక్సెస్ అయి మంచి కలెక్షన్లను రాబట్టాయి.. అలా మూడు నెలల్లోనే టాప్-5 గ్రాస్ చిత్రాల జాబితా ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా వాల్తేర్ వీరయ్య సినిమా ఉన్నది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించగా.. రవితేజ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఏకంగా రూ.220 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు సాధించింది. ఇక తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా.. ఈ చిత్రం రూ.133.82 కోట్ల రూపాయలను గ్రాస్ వసూలు సాధించింది.

ఇక మరొక చిత్రం ధనుష్ నటించిన మొదటి తెలుగు చిత్రం సార్.. ఈ చిత్రం మూడవ హైయెస్ట్ క్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ.115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం సినిమా ఇప్పటివరకు రూ .25 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు సాధించింది. ఇక ఇప్పుడు నాని నటించిన దసరా సినిమా రూ .54 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ మూడు నెలలలోనే టాప్ ఫైవ్ చిత్రాలుగా ఇవి నిలవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news