వారికి గుడ్ న్యూస్.. ఈ కేంద్ర పథకంతో రూ.5 వేలు..!

-

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి వరకు చాలా స్కీమ్స్ ని కేంద్రం తీసుకు రావడం జరిగింది. అయితే వాటిల్లో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఈ పథకం ద్వారా గర్బిణీ స్త్రీలకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందుతుంది. 3 కోట్లకుపైగా మహిళలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద 3.32 కోట్ల మంది ఇప్పటి దాకా నమోదు చేసుకున్నారు. రూ.13, 766 కోట్ల మేర పంపిణీ చేసింది.

ఇక ఈ స్కీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలని చూద్దాం. గర్బిణీ మహిళలు, పాలిచ్చే తల్లులకు రూ.5 వేలు డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మూడు విడతల్లో ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. రెండో ఇన్‌స్టాల్ మెంట్‌ను ఆరు నెలలో ఒకసారైన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందినట్లయితే రూ.2000 ని ఇస్తారు. అలానే మిగిలిన రూ.2 వేలు తుది విడత కింద ఇస్తారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని రోజు వారీ కూలీ చేసుకునే మహిళలు, ఆర్థికంగా వెనకబడిన మహిళల కోసం తీసుకు వచ్చారు.

ఈ స్కీము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వర్తించదు. అదే విధంగా మొదటి కాన్పుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మాతృ వందన యోజనలో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వుంది. స్థానిక ఆశా వర్కర్‌ను కలిసినా కూడా ఈ స్కీమ్ లో చేరచ్చు. https://pmmvy-cas.nic.in/public/beneficiaryuseraccount/login లింక్ ద్వారా కూడా నేరుగా చేరవచ్చు. అలానే బెనిఫీషియరీ లాగిన్ ఆప్షన్ ఎంచుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకున్నట్లు కొన్ని డాక్యుమెంట్లు అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news