పాదయాత్ర చేసే వాళ్ళు రైతులు కాదు – మంత్రి చెల్లుబోయిన

-

బాధ్యతను విస్మరించే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. రైతుల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని.. అసలు పాదయాత్ర చేసే వాళ్ళలో రైతునే లేరని అన్నారు. రైతులను పీడించే రాబందులు పాదయాత్రలో ఉన్నారని ఆరోపించారు.

కొడాలి నాని పై సోషల్ మీడియాలో టిడిపి నేతలు ట్రోల్లింగ్ చేస్తున్నారని.. చంద్రబాబు గురించి కొడాలి నాని వాస్తవాలు చెబితే బూతులు తిడతారా? అంటూ ప్రశ్నించారు. రైతుల పేరుతో రాష్ట్రాన్ని దగా చేయడానికి ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే వ్యోమగామికి వెళ్లాలన్న పశ్చిమగోదావరి జిల్లా బాలిక జాహ్నవికి ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. జాహ్నవికి 50 లక్షల మేర ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. 50 లక్షల చెక్కును బాలిక జాహ్నవి కుటుంబానికి అందజేశారు మంత్రి చెల్లుబోయిన. పైలట్ ట్రైనింగ్ కోర్స్ నిమిత్తం 50 లక్షలు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news