దూసుకొచ్చిన ట్రక్‌.. ముగ్గురు రైతులు మృతి

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ లో గత నెలరోజుల కింద రైతులపై కి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సంఘటన మరువకముందే హర్యానా లో ఇలాంటి దారుణం మరోటి జరిగింది.

accident

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు 11 నెలల నుంచి ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ – హర్యానా బోర్డర్ సమీపంలో ముగ్గురు మహిళా రైతులపై నుంచి వేగంగా ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ మహిళా రైతులు మృతి చెందారు.

ఆటో కోసం ఎదురు చూస్తూ. … డివైడర్ పై కూర్చోగా… ఆ సమయంలోనే ట్రక్కు వేగంగా వారి పైకి దూసుకు వచ్చింది. అయితే ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా ఒకరు ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్ పరారయ్యాడని పేర్కొన్నారు పోలీసులు. ఒక ప్రాథమిక దర్యాప్తులో వీరు పంజాబ్ లోని మన జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news