కేసీఆర్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం.. మండలాల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు మండలాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. నారాయణ పేట జిల్లాలో 2 మండలాలు… వికారాబాద్ జిల్లాలో ఒక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

telangana-logo

తెలంగాణ సర్కార్‌ కొత్త నిర్ణయంతో… నారాయణ పేట జిల్లాలో కొత్త మండలాలుగా గుండుమల్, కొత్తపల్లె ఏర్పాటు కానున్నాయి. అదే విధంగా వికారా బాద్ జిల్లాలో దుద్యాల్ కు మండలంగా రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మండలాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే నెల రోజుల్లో తెలపాలని ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఆయా మండలాల ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు సూచనలు ఇచ్చాక… దీనిపై ఫైనల్‌ నిర్ణయం ఉంటుందని కూడా నోటిఫికేషన్‌ లో స్పష్టం చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై.. ఆయా మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news