ఏడాదిలోపే మహేష్‌ కుటుంబంలో ముగ్గురి మృతి

-

సూపర్​స్టార్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మహేష్ బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది.

ఈ సంవత్సరంలోనే అయిన వాళ్ళను కోల్పోయాడు. తండ్రి, తల్లి, సోదరుడు కన్నుమూయడంతో మహేష్ దుఃఖంలో మునిగిపోయాడు. జనవరిలో సోదరుడు రమేష్ బాబు, సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణ కన్నుమూశారు. ఒకరు దూరం అయ్యారు అనే బాధ మరిచిపోకముందే మరొకరు దూరమయ్యారు. దీంతో ‘మహేష్ అన్న నీకే ఎందుకు ఈ బాధలన్నీ, స్టే స్ట్రాంగ్’ అని అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news