నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ముగ్గురు వడ్డీ వ్యాపారులు అరెస్ట్

-

విజయవాడలో నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు విజయవాడ పోలీసులు. అలాగే నాలుగో వ్యక్తి అయిన గణేష్ కోసం నిజామాబాద్లో గాలింపు చర్యలు మొదలు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ వడ్డీ వ్యాపారుల టార్చర్ భరించలేక… పప్పుల సురేష్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులు విచారణలో నిర్ధారించారు.

ఈ నేపథ్యంలోనే ముగ్గురు కీలక నిందితులను ఇవాళ అరెస్టు చేశారు విజయవాడ పోలీసులు. మరో నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడు. కాగా ఈ నెల 6వ తేదీన విజయవాడ కు వెళ్ళిన నిజామాబాద్ జిల్లా పుప్పాల సురేష్ కుటుంబం అక్కడే ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు సురేష్ సెల్ఫీ వీడియో ని తీసుకున్నాడు. సురేష్ ఆయన భార్య ఇద్దరు, కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పాల్వంచ లో రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్న అనంతరమే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రెండు రాష్ట్రాల్లోనూ… ఈ కుటుంబ ఆత్మహత్య కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news