అమెరికాలో రోడ్డు ప్రమాదం అప్డేట్.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి

-

అమెరికాలో మంగళవారం రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో ఎనిమిది మంది స్నేహితులు  కారులో బయలుదేరారు. పొగమంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటం శెట్టి శ్రీనివాస్‌ కుమారుడు పాటం శెట్టి నరసింహ(23) కాగా మరో ఇద్దరు పావని(వరంగల్‌), ప్రేమ్‌కుమార్‌ రెడ్డి (హైదరాబాద్‌) దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరు ఏపీకి చెందిన వారు కాగా మిగిలిన వారు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువతి, యువకులు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news