బాలయ్య, చిరు సినిమాల టిక్కెట్స్ రేట్స్ ఎంతంటే..!!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా  విడుదల అయిన సినిమాను మినిమం గ్యారెంటీ ఉంటుంది.అందుకే చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య , విజయ్, అజిత్ అందరూ  సంక్రాంతి బరిలో ఉన్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య  సినిమాను  సంక్రాంతి  పండుగ సందర్భంగా 13 న రిలీజ్ చేస్తున్నారు. అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా , ఒక రోజు ముందుగానే అంటే జనవరి 12వ తేదీ న విడుదల కాబోతుంది. ఇక దిల్ రాజు సినిమా వారసుడుగా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధంగా వుంది. వీళ్ళు కూడా కూడా 12 తేదీన కర్చీఫ్ వేశారు.

వారసుడు, అజిత్ తెగింపు  సినిమాలు ఉన్నా కూడా    ఎక్కువ బజ్ మాత్రం చిరు బాలయ్య సినిమాలపైనే ఉంది. ఇక వాల్తేరు వీరయ్య వీరసింహా రెడ్డి రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. చాలా ఏరియాలో వారే సొంతంగా రిలీజ్ చేసు కుంటున్నారు. ఈ రెండు సినిమాలకు టిక్కెట్ రేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయట. ఏ సెంటర్లో 200 వరకు కూడా ఫిక్స్ చేశారని ఇక బీసీ సెంటర్లలో మాత్రం 150 రూపాయలకు ఒక టికెట్ ధరలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news