మంత్రికి వీఐపీ మర్యాదలు.. జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్‌

-

ఓ మంత్రికి వీఐపీ మర్యాదలు చేసిన ఆరోపణలతో తిహార్ జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వేసిన ఎంక్వయిరీ కమిటీ సిఫార్సు మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగింది అంటే..?

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న దిల్లీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్‌ జైన్‌కు తీహార్‌ జైల్లో వీఐపీ మర్యాదలు చేసినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ జైలు సూపరింటెండెంట్‌ అజిత్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. సత్యేందర్‌ జైన్‌ను ఉంచిన జైలు నెంబర్‌ 7 సూపరింటెండెంట్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆప్‌ మంత్రికి వీఐపీ మర్యాదలు చేస్తున్నాడని ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎంక్వయిరీ కమిటీ వేశారు. ఎంక్వయిరీ ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో జైలు సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news