BREAKING : నేడు ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం

-

BREAKING : ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.

 

 

అయితే, ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా,మొన్న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై చర్చించారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news