కోలీవుడ్ లోకి అడుగు పెడుతున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించింది హీరోయిన్ చాందినీ చౌదరి. అయితే ఈమె కొన్ని సందర్భాలలో తనకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం తో మంచి సక్సెస్ సినిమాలను మిస్ చేసుకుంది. ఇలాంటి టైమ్ లో కలర్ ఫోటో చాందినీ చౌదరికి మంచి బ్రేక్ వచ్చింది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు.

ఆహాలో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీకి బెస్ట్ సినిమా అవార్డు కూడా వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నటి అశోక్ సెల్వం తదుపరి చిత్రంలో నటించనుంది.

ఈ సినిమాతో ఈ టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. అదే విషయాన్ని నటి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధ్రువీకరించింది. చాందిని తో పాటు మేఘ ఆకాష్ మరియు కార్తీక మురళీధరన్ కూడా ఇతర కథానాయకులుగా నటిస్తున్నారు. కమలహాసన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సిఎస్ కార్తికేయ అనే దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news