బైక్‌పై వెంబడించి బీజేపీ నేతను చంపిన దుండగులు

-

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన ఓ నేతను దారుణంగా హత్య చేశారు. కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బీజేపీ యువమోర్చా యువనేత ప్రవీణ్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుళ్య తాలుకా బెళ్లారపేటెకు చెందిన ప్రవీణ్ స్థానికంగా పౌల్ట్రీ షాప్ నిర్వహిస్తున్నాడు.

బీజేపీ యువనేత ప్రవీణ్
బీజేపీ యువనేత ప్రవీణ్

మంగళవారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు ప్రవీణ్‌ను బైక్‌పై వెంబడించారు. సినిమాల్లో వెంటాడినట్లు ప్రవీణ్‌ను వెంటాడి.. నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పుత్తూరులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news