నేడు టాలీవుడ్ ప్రముఖుల భేటీ..సమావేశానికి చిరు, మోహన్ బాబు !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను గతకొన్ని రోజులుగా అనేక సమస్యలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం… తీసుకుంటున్న నిర్ణయాల తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చాలా నష్టాలు వస్తున్నాయి. టికెట్ల ధరలు తగ్గించడం, బెనిఫిట్ షో రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. థియేటర్ల టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానంతో పాటు.. ఇతర సమస్యలపై ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. ఈ సమావేశం తర్వాత తొలిసారి తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. దీని కోసం ఇప్పటికే 240 మందికి ఆహ్వానాలు అందాయి. అయితే అయితే ఈ సమావేశానికి మంచు మోహన్ బాబు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అలాగే మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. దీంతో ఈ సమావేశం పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. వీరు ముగ్గురు సమావేశానికి రావడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news