తెలంగాణకు కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలు

-

తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయింది. రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయాలని ఏఐసిసి ఇంచార్జ్ కు పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నతెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ ఎల్లుండి నుంచి రాష్ట్ర పార్టీ నేతలతో సంప్రదింపులు జరపనున్నారు. రాష్ట్రంలో అన్ని స్థాయిలలోని పార్టీ నేతల నుంచి మాణిక్కం ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేయనున్నట్టు సమాచారం.

రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపనున్నారు ఆయన. ఎలాంటి వివాదాలు రాకుండా  మెజారిటీ నేతల అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలపనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి, జగ్గా రెడ్డి, వీహెచ్ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో పదవి ఎవరికి దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news