తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్‌

-

తెలంగాణలో చాలా జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న మరియు మొన్నటి రోజున కురిసిన వర్షాలతో అన్ని జిల్లాల్లో అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ కుండపోత వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.

అయితే.. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు మహరాష్ట్ర లోనూ విపరీతంగా వర్షాలు పడుతున్నారు. ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర మరియు మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరి ఉగ్ర రూపం గా ప్రవహిస్తోంది… ముఖ్యంగా కందకుర్తి బ్రిడ్జి పై నుండి ఉదృతంగా ప్రవహిస్తోంది గోదావరి నది. భారీగా నీటి ప్రవాహం ఉండటంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి. ఇక అటు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా.. ఈ భారీ వర్షాలు కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా కళకళలాడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news