తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీలు..!

-

తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరికొద్ది మందిని కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. పెద్దపల్లి కలెక్టర్ గా ఉన్న  ముజామిల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. మంచిర్యాల కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ కలెక్టర్ గా, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల కలెక్టర్ గా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్న అనురాగ్ జయంతికి కరీంగర్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ కలెక్టర్ గా ఉన్న ఆశీస్ సంగ్వాన్ కి కామారెడ్డి కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

సూర్యపేట కలెక్టర్ గా తేజస్ నందులాల్ పవార్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీ హర్ష,  నారాయణ పేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కొత్తగూడం కలెక్టర్ గా జితేశ్ వి పాటిల్, రాహుల్ శర్మ భూపలపల్లి, హన్మకొండ కలెక్టర్ గా ప్రావిన్య, సత్యప్రసాద్ జగిత్యాల కలెక్టర్, విజేంద్ర మహూబూబ్ నగర్ కలెక్టర్ గా, కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్ గా, ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్ గా, నారాయణరెడ్డి నల్లగొండ, ఆదర్శ్ సురభి వనపర్తి, సత్య శారదా దేవి వరంగల్ కలెక్టర్ గా, దివాకర ములుగు కలెక్టర్ గా, అభిలాష అభినవ్ నిర్మల్ కలెక్టర్ గా నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version