తెలంగాణ లో ఆరుగురు డిఎస్పీల బదిలీ

-

రాష్ట్రంలో ఆరుగురు డిఎస్పి/ ఏసిపి లను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, బేగంపేట ఏసిపి నరేష్ రెడ్డిని మల్కాజిగిరి ఏసీపీ గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న శ్యాం ప్రసాద్ రావు ను డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి రవీంద్ర రెడ్డి ని సంగారెడ్డి డీఎస్పీ గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న బాలాజీని డిజిపి కార్యాలయానికి స్థానచలనం కల్పించారు.

ఖమ్మం జిల్లా వైరా డిఎస్పీగా రెహమాన్ కి పోస్టింగ్ ఇచ్చారు. ఆ స్థానంలో ఉన్న సత్యనారాయణను డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రవాణా శాఖ కమిషనర్ గా డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల క్రితం ఎంఆర్ఎం రావు బదిలీపై వెళ్లిన అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బుద్ధప్రకాష్ జాయింట్ కమిషనర్ రమేష్, మమతా ప్రసాద్, పాండు రంగ నాయక్, డిప్యూటీ కమిషనర్ పాపారావు లతో సమావేశమై రవాణాశాఖ కార్యకలాపాలను సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news