సెప్టెంబర్ 2 నుంచి టిఆర్ఎస్ జెండా పండగ : హరీష్ రావు

-

సిద్దిపేట : సెప్టెంబర్ రెండో తేదిన టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ నేపథ్యం లో టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నేతలు, కార్యకర్తలకు పిలిపునిచ్చారు హరీశ్ రావు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల తో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

harish rao | హరీష్ రావు

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారని పేర్కొన్న ఆయన.. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా పండుగ చేయాలని పేర్కొన్నారు. జెండా పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జెండా పండుగ అంటే.. తెలంగాణ పండుగ అని.. టీఆర్ఎస్ పండుగ అంటే తెలంగాణ ప్రజల పండుగ అని హరీశ్ రావు అన్నారు. జెండా పండుగను నిర్లక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం వహించిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని హెచ్చరికలు జారు చేశారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news