కేంద్ర గిరిజన శాఖ మంత్రిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్

-

గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పారు. అసెంబ్లీ తీర్మాణం చేసి పంపిన బిల్లును ఇంకా రాలేదని కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి చెప్పడం దారుణం అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో కేంద్రమంత్రి తీరు గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. దీంతో కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మాణం అందలేదని తుడు అనడంతో టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని ఎన్నో సార్లు 16,17 లోక్ సభల్లో లేవనెత్తామని… టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు మాట్లాడరని.. ఎన్నోసార్లు లేఖలు రాశారని ఆయన అన్నారు. 2017 తీర్మాణం చేసి పంపించామని ఐదేళ్లు గడిచినా..కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. గిరిజనుల రిజర్వేషన్లపై లోక్ సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news