ఈ నెల 27న తెలంగాణ టెట్ ఫలితాలు

-

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష (టెట్‌)కు తెర పడింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీలో నిర్వాఘ్నంగా ముగిసింది. అధికార వర్గాలు వెల్లడించాయి. పేపర్-1 పరీక్షకు 3,18,506 మంది హాజరయ్యారని… పేపర్-2కి 2,51,070 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తమ్మీద టెట్ కు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. తొలిసారి 2016 మేలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2017 జులైలో టెట్ జరపగా, మళ్లీ ఐదేళ్ల తర్వాత తాజాగా టెట్ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ఈ సంవత్సరం ఒక్కసారిగా కొలువుల జాతరను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లకు చెందిన పరీక్షలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news