ఈ నెల 19న సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభం

-

ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌ ఫిక్స్‌ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 19న హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో తెలుగు రాష్ట్రాల తొలి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య ఈ రైలు నడవనుంది.

దీన్ని విశాఖ వరకు పొడగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కర్ణాటకలోని కలబురగి నుంచి ప్రధాని హైదరాబాద్ వస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్రంలో అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్ ను రూ.699 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. గుత్తేదారు ఎంపిక అక్టోబర్లోనే పూర్తయింది. రైల్వే శాఖ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news